వెనకకు | భగవద్గీత | ముందుకు |
---|---|---|
ఆధ్యాయ సారాంశం
విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. వారిలో ఏఒక్కడో భగవంతుని తెలుసుకోగలుగుతాడు.
భగవంతుని ప్రకృతి (మాయ) మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు అనే ఎనిమిది తత్వాలుగా విభజింపబడింది. ఇది అపరా ప్రకృతి. ఇంతకంటె ఉత్తమమైనది పరాప్రకృతి భగవంతుని చైతన్యము. ఈ రెండింటి సంయోగం వలన సృష్టి జరుగుతుంది. మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించియున్నాడు. భగవంతుకంటె వేరుగా ఏదీ లేదు.
ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ వాసుదేవమయమని తెలుసుకొని కొలుస్తృఆడు గనుక అతడు భగవంతునికి ప్రియతముడు. అనేక దేవతల రూపాలలో భగవంతుని ఆరాధించే భక్తులను ఆయా దేవతలస్వరూపంలో వాసుదేవుడు అనుగ్రహిస్తాడు. దేవతలనారాధించేవారు దేవతలను, సర్వేశ్వరుని ఆరాధించేవారు సర్వేశ్వరుని పొందుతారు. జన్న జరా మరణాలనుండి మోక్షాన్ని పొందగోరినవారు దేవదేవుని (వాసుదేవుని) ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మమును పొందుతారు. .
1 వ శ్లోకము |
2 వ శ్లోకము |
3 వ శ్లోకము |
4 వ శ్లోకము |
5 వ శ్లోకము |
6 వ శ్లోకము |
7 వ శ్లోకము |
8 వ శ్లోకము |
9 వ శ్లోకము |
10 వ శ్లోకము |
11 వ శ్లోకము |
12 వ శ్లోకము |
13 వ శ్లోకము |
14 వ శ్లోకము |
15 వ శ్లోకము |
16 వ శ్లోకము |
17 వ శ్లోకము |
18 వ శ్లోకము |
19 వ శ్లోకము |
20 వ శ్లోకము |
21 వ శ్లోకము |
22 వ శ్లోకము |
23 వ శ్లోకము |
24 వ శ్లోకము |
25 వ శ్లోకము |
26 వ శ్లోకము |
27 వ శ్లోకము |
28 వ శ్లోకము |
29 వ శ్లోకము |
30 వ శ్లోకము |
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమోऽధ్యాయః|| 7 || |
© Copyright శ్రీ భగవధ్గీత