వెనకకు | భగవద్గీత | ముందుకు |
---|---|---|
28 వ శ్లోకం
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ |
అర్జున ఉవాచ |
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ||1-28|| .
అర్జునుడు ఇలాఅన్నాడు; ఉదృతమైన కరుణ ఆవహించగా విషాదంతో ఇలా అన్నాడు. యుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న నా బంధువులను చూడగా;
. సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎంతో దయతో శ్రీకృష్ణుని అవతారంలో ఈ ఇలలో ఆత్మజ్ఞానం బోధించడానికి అర్జునుని నిమిత్తమాత్రుని చేసుకుని సర్వమానవాళికి ఈ జ్ఞానం అందించారు. అర్జునునికి చాన్దోగ్యోపనిశాద్ 8.15 శ్లోకంలో చెప్పిన “ఆహిమ్స్యాత్ సర్వభూతాని” అంటే ఏ జీవునికి మనం హాని చెయ్యకూడదు అన్న విషయం స్ఫురింపచేసి దానినుండి మాయలోకి దించాడు. ఏదైనా శ్లోకాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటే వచ్చే బాధలను అర్జునుని ద్వారా మనకు బోధింపదలచాడు. ఒక క్షత్రియుడు ఇటువంటి మాటలు చెప్పి తన ధర్మం నుండి తప్పుకోకూడదు. కౌంతేయ అని అర్జునుని పిలవడం ద్వారా కుంతీదేవికి జరిగిన అవమానాలు, ఎంతటి కష్టాల్లోనైనా నిలదొక్కుకుని ముందుకు నడిచిన అతని తల్లిని గుర్తు చేస్తూ అర్జునుని కర్తవ్యం గుర్తు చేస్తున్నాడు. పరయా అన్న పదం ద్వారా తన సేనల మీదనే కాక తన శత్రువుల సైన్యాల మీద కూడా జాలి, దయ పెచ్చరిల్లి తన కర్తవ్యాన్ని మర్చిపోయి దైన్యంలోకి కూరుకుపోయే యోధుని గురించి తెలుపుతూ, విశిదన్ అన్న పదం ద్వారా బెంగ పెట్టుకున్న వాడిగా, గద్గదమైన గొంతుతో మాట పెగలక, వణుకుతూ బాధలో ఉన్న, గొంతు తడి ఆరిపోయిన అర్జునుడు ఇలా పలకడం మొదలుపెట్టాడు.
© Copyright శ్రీ భగవధ్గీత