వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

4 వ శ్లోకం

అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||1-4|| .

ఇక్కడ శూరులూబలమైన ధనువులు కలవాళ్ళూ, యుద్ధంలోభీమార్జునతో దీటు రాగలిగిన వాళ్ళూ సాత్యకి, విరాటుడు మహారధుడు దృపదుడు ఉన్నారు.
ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.
రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు
మధ్వాచార్యులవారు: “అత్రశూరః” అన్న పదం గర్భితనింద గా అన్నాడు దుర్యోధనుడు. దృష్టద్యుమ్నుడు నిలిపిన సైన్యం అంత గొప్పగా వుంటే మన సైన్యం గురించి, మన బలం గురించి తక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. మనము కూడా వారినందరినీ ఓడించగలిగిన వాళ్ళమే అంటూ స్వాంతన వచనాలు పలుకుతూ పాండవులవైపున్న గొప్ప యోధులగురించి ప్రస్తావిస్తున్నాడు. యుయుధనుడు (సాత్యకి ), విరాటరాజు, ద్రుపదుడు కూడా భీమార్జునులకు తీసిపోని మహారధులు. మహారధులు అంటే తమవైపు 10వేల మందిని కాపాడుకుంటూ శత్రుసైన్యంలో 10వేలమందిని దునుమాడగల సామర్ధ్యం ఉన్నవారు.

"నా మనస్సు సందేహాలతో నిండిపోయినప్పుడు,
నిరాశ, నిస్పృహలు నా మనస్సుని క్రుంగ తీసేటప్పుడు,
ఏ ఆశాకిరణం కనుచూపు మేరలో కానరాని వేళ,
ఒక్కసారి "భగవద్గిత" ను చదవడం మొదలు పెట్టానా,
ఏవీ ఆ కష్టసాగర తరంగాలు? మాయం.
బాహ్య ప్రపంచం అంతా కష్టాలతో కరుడు కట్టుకుపోయిన
అంతరాత్మ అంతా చెప్పలేనంత శాంతి భరితమై వుంటుంది.
నిజంగా ఇది అంతా ఆ గీత మూలంగా ఏర్పడినదే! దాని ప్రభావం అంతటిది."
-మహాత్మా గాంధీ

నిజమైన ధర్మం అంటే ఏంటి?


శోకమనేది నివృత్తి కావాలంటే ఒకటి మానవ ప్రయత్నం, రెండు ఈశ్వరానుగ్రహం ఉండాలి. ప్రయత్నం చేస్తేగానీ అనుగ్రహం ఉండదు. వాస్తవానికి ఆయన ఎక్కడో లేడు. మనలోనే ఉన్నాడు..
ధర్మం లేదా మతం అనేది ప్రత్యేకించి ఒక మత సిద్ధాంతానికి సంబంధించింది కాదు. అలాంటప్పుడు నిజమైన ధర్మం ఏంటి? అంటే, ‘ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం’ భగవంతుడు దేనినైతే నిర్దేశించాడో అదే నిజమైన ధర్మం. రాజ్యాంగానికి సంబంధించిన చట్టం ప్రభుత్వంతో ఎలా విధించబడి ఉంటుందో అదే విధంగా దేవదేవుని చేత విధించబడేది అసలైన ధర్మం. భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఆయన ఆదేశం కూడా ఒక్కటే అయి ఉండాలి. మరి ఇన్ని రకాల ధర్మాలు ఎలా ఉంటాయి? అది సాధ్యం కాదు. ధర్మం పేరిట భిన్నమైన అభిప్రాయానికి రావడం అఙ్ఞానం వలన మాత్రమే జరుగుతుంది. హిందూ ధర్మం, ముస్లిం ధర్మం, క్రైస్తవ ధర్మం ... ఇలా ఎన్నో మతపరమైన ధర్మాలు ఉన్నాయి.
ఉదాహరణకు బంగారం అంటే బంగారమే.. అంతేగానీ క్రైస్తవుల వద్ద ఉన్నది క్రిస్టియన్ల బంగారం, హిందువుల వద్ద ఉన్నది హిందువుల బంగారం అవుతుందా? లేదు సువర్ణం ఎక్కడ ఉన్నా సువర్ణమే. అదే విధంగా భగవంతునికి దాసోహమవడమనేది పరిపూర్ణమైన ధర్మం.
సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ! , అహం త్వా సర్వ పాపేభ్యోమోక్ష యిష్యామి మా శుచ! అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి నీవుకాదు, నిరంతరం నువ్వు నువ్వుగానే ఉండు. సర్వ పాపాల నుంచి మోక్షం పొందుతావు. పనికిరాని కోర్కెలతో, తెలివి తక్కువ తనంతో అప్రామాణికమైన కర్మలు ఆచరిస్తున్న వారు క్రూరత్వం, అసుర స్వభావం పెంచుకుంటూ, మందబుద్ధులై మాయలో పడిపోతుంటారు... ధర్మాన్ పరిత్యజ్య అంటే సర్వ ధర్మాలను పరిత్యజించి తననే శరణు పొందమని కృష్ణుడు ఆనాడే చెప్పాడు. ఇదే భాగవత ధర్మం.. భగవంతుని ఎలా ఆశ్రయ పొందాలో ప్రతి ఒక్కరికీ నేర్పించాలి.
భగవంతుడు ఒక్కడే, ఇద్దరు ముగ్గురు దేవుళ్లు, వారి మధ్య పోటీ ఉందంటే వారు అసలు దేవుళ్లే కాదు. ప్రతి చోట ఎవరో ఒక దేవుడు ఉండడం ప్రస్తుతం కాలంలో పరిపాటిగా మారిపోయింది. గీతలో భగవానుడు వివరించింది ఇలాంటి దేవుడి గురించి కాదు. అతడు దేవాదిదేవుడు. ‘అన్యథా శరణం నాస్తి’ అని అందరూ ఆశ్రయించాల్సింది అతడినే. అదే పరి పూర్ణమైన ధర్మం.
మనలో అహంకారం నశించినప్పుడు భగవంతుడు మనవాడు అవుతాడు. నేను, నాది, నా అనే అర్థాలకు వాడు, వాడిది, వాడే అనే భావాన్ని జొప్పించాలి. భగవంతుడు తప్ప అన్యం ఏదీ లేదు అనే సత్యానికి మనం దగ్గర కావాలి. ‘సత్య నిష్ఠయే ఈ కలియుగానికి తరుణోపాయం’ అని శ్రీరామకృష్ణులు తెలిపారు.
Samayam Telugu | Updated:Jun 10, 2018, 05:37PM IST

వ్యాసుడు

వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు. జన్మ వృత్తాంతం వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలో పెక్కు మార్లు చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది. పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. ఇంద్రుడు వేణుదుస్టి అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉంది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పాడేస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువుకి కానుకగా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడుని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడంతో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి, ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు అని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు. దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలో ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడకు వస్తాడు. అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినది అనిజన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి జరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే, అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు. భారతంలో వ్యాసుని పాత్ర మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారతకథలో ఒకభాగమై ఉన్నాడు. అయినప్పటికీ వ్యాసుడు కర్తవ్యనిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తనదారిన తాను వెళ్ళిపోతాడు.

  • వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది.
  • సత్యవతీ శంతనుల వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుల కారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగధుడుబలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మాత్రంచే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని మరియు దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు.
  • ఆతరువాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు. * దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆ
  • తరువాత లక్క ఇంటి దహనం తరువాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివసించిన ఆశ్రమప్రాంతంలో పాడవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రథమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలరచి సూచించి తనదారిని తాను వెళతాడు.
  • ఆ తరువాతి కాలంలో ద్రౌపతీ స్వయంవరానికి ముందుగా పాందవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపతి పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపతీ వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.

© Copyright శ్రీ భగవధ్గీత